News April 23, 2025

HYD: MLC ఎన్నిక.. 112లో 88 మంది ఓటు

image

22 ఏళ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ MLC కోటా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 112 ఓటర్లు ఉండగా మొత్తం 88 మంది ఓటు వేశారు. 24 మంది BRS ఓటర్లు మినహాయిస్తే MIM, కాంగ్రెస్, BJP సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 37.51%, మ. 12 గంటల వరకు 77.68%, మధ్యాహ్నం 78.57% ఓటింగ్ నమోదు అయ్యింది.

Similar News

News October 21, 2025

ఈనెల 25తో ముగియనున్న సర్వే: రంగారెడ్డి కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని RR జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజలు సలహాలు ఇవ్వాలన్నారు.

News October 21, 2025

HYD: సెల్యూట్.. వీరులారా మీకు వందనం!

image

తెలంగాణ పోలీస్ శాఖ ఉలిక్కిపడిన ఘటన ఇది. మావోలు ఏకంగా పోలీస్ స్టేషన్‌ను పేల్చేశారు. ఇది జరిగి 28 ఏళ్లు గుడుస్తున్నా నేటికి అమరులైన పోలీసులే యాదికొస్తుండ్రు. 1997లో యాచారం PSలో జమీల్ అహ్మద్, రాజేశ్వర్ రావు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పథకం ప్రకారం మావోలు స్టేషన్‌‌ను పేల్చివేయడంతో విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరులకు నివాళి అర్పిద్దాం.

News October 19, 2025

HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

image

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.