News April 9, 2025

HYD: MMTS మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు

image

HYDలోని నాలుగైదు MMTS ట్రెన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం త్వరలో అన్ని MMTS ట్రెయిన్లలోని మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే MMTS స్టేషన్లలో కూడా కెమెరాల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.

Similar News

News January 4, 2026

GHMCలో పన్నుల లెక్క.. ఎవరి పవర్ ఎంత..?

image

GHMC పరిధిలో ఆస్తి పన్ను మదింపు అధికారుల అధికారాలపై స్పష్టత వచ్చింది. 10 వేల చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న భవనాల పన్ను వ్యవహారాలను డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. అంతకు మించి విస్తీర్ణం ఉన్నా లేదా ఐదేళ్ల కంటే పాత బకాయిల సర్దుబాటు చేయాలన్నా నేరుగా జోనల్ కమిషనర్ అనుమతి తప్పనిసరి. చిన్నచిన్న మార్పులకు లోకల్ ఆఫీసర్ చేస్తారు కానీ పెద్ద ప్రాపర్టీల లెక్కలన్నీ జోనల్ స్థాయిలోనే తేలనున్నాయి.

News January 4, 2026

UPDATE.. HYD: అగర్ ప్లేట్స్ తయారీకి జీవాల రక్తం !

image

నాగారంలో పోలీసుల దాడిలో పట్టుబడిన జీవాల <<18758795>>రక్తం సేకరణ<<>> వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాబ్‌లో బ్యాక్టీరియా పెంపకానికి వాడే ‘అగర్ ప్లేట్ల’ తయారీ కోసం మేకలు, గొర్రెల రక్తం వాడుతున్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోషకాలు కలిగిన ఈ రక్తం ద్వారా కష్టతరమైన బ్యాక్టీరియాను పెంచుతారని నిపుణులు చెబుతున్నారు. హిమోలిసిస్ ప్రక్రియ కోసం రక్తాన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. దీనిపై విచారణ జరుగుతోంది.

News January 4, 2026

ముగిసిన GHMC విభజన.. Feb 9న CM గ్రీన్ సిగ్నల్!

image

GHMC కొత్త అధ్యాయం మొదలైంది. 3 కార్పొరేషన్ల ప్రక్రియ 100% పూర్తైంది. ఫైల్ వర్క్, వార్డుల పునర్విభజన సైలెంట్‌గా క్లోజ్ చేసేశారు. 300 వార్డులకు పెంచుతూ పాలనాపరమైన కేటాయింపులూ ముగిశాయి. ముగ్గురు సిటీ ప్లానర్లు వెంకన్న (శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్), ప్రదీప్ కుమార్ (మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్), శ్రీనివాస్ (చార్మినార్, ఖైరతాబాద్, 6 జోన్లు)కు GHMC బాధ్యతలు అప్పగించింది.