News March 16, 2024

HYD: మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు: గజ్జల నగేశ్

image

ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జల నగేశ్ అన్నారు. ఇది బీజేపీ కుట్రలో భాగమని, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో కవితను అరెస్టు చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో మనోస్థైర్యం దెబ్బతీసేందుకే కుట్రలు చేశారని, మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలని ఆయన మండిపడ్డారు. 

Similar News

News August 21, 2025

హజ్‌ యాత్రకు HYD నుంచి 2,210 మంది ఎంపిక

image

హజ్‌ యాత్రకు నగరం నుంచి 2,210 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ సయ్యద్‌ ఆఫ్జల్‌ బియబానీ ఖుస్రో పాషా తెలిపారు. తెలంగాణ నుంచి మొత్తం 4,292 మందిని డ్రా పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. 11,757 మంది అప్లై చేసుకోగా వీరిని డ్రా పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. మరింత సమాచారం కోసం హజ్‌ కమిటీ కార్యాలయంలో సంప్రదించాలని ఈ సందర్భంగా సూచించారు.

News August 21, 2025

పంజాగుట్ట నిమ్స్‌లో ప్రపంచ సుందరి

image

ప్రతష్ఠాత్మక నిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను ప్రపంచ సుందరి ఓపల్ సుచాత పరామర్శించారు. ఇందులో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సదుపాయాలను డైరెక్టర్ డా.బీరప్ప వివరించారు. అనంతరం ఆమె ఆంకాలజీ బ్లాక్‌లో రోగులకు పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ వైద్యుడు డా.సదాశివుడు, మీడియా ఇన్‌ఛార్జి సత్యాగౌడ్ తదితరులు ఉన్నారు.

News August 21, 2025

HYDలో సక్సెస్.. ఇక రాష్ట్రమంతటా!

image

మంత్రి సీతక్క బుధవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలో చిన్నారులకు త్వరలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే HYDలో 139 అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయగా హాజరు 30% పెరిగిందని వెల్లడించారు. అంగన్వాడీ నూతన భవనాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని ఆదేశించారు. టిఫిన్‌తో పాటు 100ML పాలు, వారంలో ఓ రోజు ఎగ్ బిర్యానీ, మరో రోజు వెజిటబుల్ కిచిడీ అందిస్తారు.