News March 16, 2024
HYD: మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు: గజ్జల నగేశ్

ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జల నగేశ్ అన్నారు. ఇది బీజేపీ కుట్రలో భాగమని, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో కవితను అరెస్టు చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో మనోస్థైర్యం దెబ్బతీసేందుకే కుట్రలు చేశారని, మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలని ఆయన మండిపడ్డారు.
Similar News
News October 29, 2025
జూబ్లీహిల్స్: KTR రోడ్ షో తేదీలు ఖరారు

జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. OCT 31న షేక్పేట్, NOV 1న రహమత్నగర్, 2న యూసుఫ్గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంకట్రావునగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లలో వరుసగా రోడ్షోలు నిర్వహించనున్నారు. 30వ తేదీని నుంచి సీఎం నియోజకవర్గ పర్యటన ఖరారైంది. KCR పర్యటనపై ఇంకా స్పష్టతలేదు.
News October 29, 2025
జూబ్లీహిల్స్ బై పోల్లో కాస్ట్ పాలి‘ట్రిక్స్’..!

జూబ్లీహిల్స్ గెలుపుకోసం కాస్ట్ ఓటింగ్పై నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే కమ్మ సామాజికవర్గం కాంగ్రెస్కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కులాల వారీగా బీసీల ఓట్లు 1.34 లక్షలు, ముస్లిం మైనారిటీలు 1.20 లక్షలు, కమ్మవారి ఓట్లు 22,746, రెడ్డిలు 17,641, లంబాడీలు 11,364, క్రిస్టియన్లు 19,396 మంది, ఎస్సీలు 28,350 మంది ఉన్నట్లు సమాచారం. ఏపీలో వర్కౌట్ అయ్యే కాస్ట్ పాలి‘ట్రిక్స్’ మన దగ్గర అమలవుతుందో చూడాలి.
News October 29, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: భద్రతకు 720 మంది కేంద్ర బలగాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పకడ్బందీగా.. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర బలగాలనూ వినియోగించుకుంటోంది. 8 కంపెనీలకు చెందిన బలగాలు నియోజకవర్గానికి వచ్చేశాయి. ఒక్కో కంపెనీలో 90 మంది చొప్పున మొత్తం 720 మంది సిటీకి చేరుకున్నారు. వీరికితోడు 1,666 మంది స్థానిక పోలీసులు భద్రతలో పాలుపంచుకుంటారు.


