News March 16, 2024
HYD: ఎంపీ ఎన్నికలు.. పార్టీల సర్వేలు

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో సర్వేలు కొనసాగిస్తున్నాయి. HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పరిధిలో ఈ ప్రయత్నాలు జోరుగా సాగుతూ ఉండటం గమనార్హం. IVR కాల్స్ ద్వారా ఓటర్ల మద్దతు తెలుసుకునేందుకు పలువురు సర్వే పనిలో పడ్డారు. వారం రోజుల నుంచి వాయిస్ కాల్స్ కూడా పెద్దఎత్తున వస్తున్నాయని ఓటర్లు చెబుతున్నారు.
Similar News
News March 3, 2026
JNTUHలో 45 మంది అధ్యాపకులకు పదోన్నతులు

JNTUHలో కెరీర్ CAS కింద 45 మంది బోధనా అధ్యాపకులకు పదోన్నతులు లభించాయి. VC డా. టి. కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ డా.కె. విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. కె. వెంకటేశ్వరరావు సమక్షంలో ఆర్డర్ కాపీలు అందజేశారు. సీనియర్ ప్రొఫెసర్గా 9 మంది, ప్రొఫెసర్లుగా 20 మంది, అసోసియేట్ ప్రొఫెసర్గా 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ హయ్యర్ గ్రేడ్ పే పొందారు.
News March 3, 2026
కీసరగుట్ట ఆలయ గోపురంపై అద్భుత దృశ్యం

నగర శివారులోని ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట శ్రీభవాని శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి గుడిలో సోమవారం రాత్రి అద్భుత దృశ్యం కనివిందు చేసింది. స్వామివారి గుడి శిఖరంపై పౌర్ణమి చంద్రుడిని చూసిన భక్తులు పరవశించిపోయారు. అనంతరం శివయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని బంధనం చేశారు.
News March 2, 2026
HYD: నీటిలో మురుగు.. జలమండలికి ఉరుకు!

నగర తాగునీటిలో కాలుష్య సెగ తగలకుండా జలమండలి ‘బస్తీ బాట’ పట్టింది. పైపులైన్లు లీకై మురుగునీరు కలిస్తే కఠిన చర్యలు తప్పవని సర్కారు హెచ్చరించడంతో అధికారులు కాలనీల్లో పర్యటిస్తున్నారు. రోజూ 5 వేల శాంపిల్స్ పరీక్షలు చేస్తున్నా, పురాతన పైపులైన్ మార్పు జలమండలికి పెద్ద తలనొప్పిగా మారింది. అక్రమ కనెక్షన్లే కాలుష్యానికి కేంద్రాలని గుర్తించి ఉక్కుపాదం మోపుతున్నారు.


