News January 29, 2025
HYD: MURDERకు గురుమూర్తి వాడిన 16 వస్తువులు!

మాధవి హత్య కేసులో భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్కు ఉపయోగించిన 16 వస్తువులను సీజ్ చేశారు.
1.స్టవ్, 2.కత్తి, 3.రోలర్, 4.రోలర్ స్టోన్, 5.బకెట్, 6.వాటర్ హీటర్, 7.క్లాత్స్ (చుడీదార్ & లెగ్గింగ్), 8. నిందితుడి Short, 9.ఫినాయిల్ బాటిల్, 10.రూమ్ ఫ్రెష్నర్, 11.సర్ఫ్ ప్యాకెట్, 12.యాసిడ్ బాటిల్, 13.డోర్ మ్యాట్, 14.చెత్త బాకెట్, 15.మోటర్ సైకిల్ 16. 2 మొబైల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.
Similar News
News November 4, 2025
సమానత్వం అప్పుడే ఎక్కువ

మహిళలు అనునిత్యం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల సమానత్వం అన్నది పుస్తకాలకే పరిమితమైంది. అయితే పురాతన కాలంలోనే ఈజిప్టు మహిళల్ని పురుషులతో సమానంగా పరిగణించేవారట. వాళ్లకంటూ సొంత ఆస్తులు, విడాకులు తీసుకునే హక్కులతోపాటు మత, రాజకీయ పదవులూ కలిగి ఉండేవారని తొలి పురావస్తు రికార్డులు చెబుతున్నాయి.
News November 4, 2025
విజయవాడ: నాగవైష్ణవి హత్య కేసు.. అతడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్ట్

విజయవాడలో 2010లో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో A3 నిందితుడిగా ఉన్న బాలిక మావయ్య పంది వెంకటరావు/కృష్ణకు భారీ ఊరట లభించింది. అతడికి కింది కోర్టు గతంలో జీవితఖైదు విధించగా హైకోర్టులో అప్పీల్ చేసుకోగా సోమవారం కేసు విచారణకు వచ్చింది. చిన్నారి హత్యలో కృష్ణ పాత్ర ఉన్నట్లు సాక్ష్యాలు లేవంటూ అతడి తరఫు లాయర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం జీవితఖైదును రద్దు చేసి నిర్దోషిగా ప్రకటించింది.
News November 4, 2025
ఇల్లందుకు బొగ్గుగడ్డగా పేరేలావచ్చిందంటే!

1870లో ఇల్లందులో బొగ్గు నిల్వలు బయటపడ్డాయి. అప్పటి నుంచి స్థానికులు ఇల్లందును ‘బొగ్గుగడ్డ’గా పిలుస్తుంటారు. భద్రాద్రి రామయ్య భక్తుడి కారణంగా నల్ల బంగారం వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఎడ్లబండిపై రాములోరి గుడికి వెళ్తూ రాత్రి సమయంలో సింగరేణి, పూసనపల్లి సమీపంలో వంట కోసం అక్కడ నల్లటి రాళ్లను పొయ్యిగా అమర్చారు. రాళ్లు నిప్పు కణికలుగా మారడం, ఎంతకీ ఆరకపోవడంతో దక్కన్ కంపెనీ నిల్వలను గుర్తించింది.


