News July 7, 2025
HYD: NIMS ఆసుపత్రిలో OP తీసుకోవడం ఇక చాలా ఈజీ.!

HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో OP తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి గతంలో ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితికి అధికారులు చెక్ పెట్టారు. ఆసుపత్రిలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసి OP రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్లిప్పు అందించే ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే స్లిప్పు వచ్చేస్తుంది. దీంతో సేవలు చాలా ఈజీగా అవుతాయని అధికారులు తెలిపారు.
Similar News
News July 7, 2025
ఆదోని: సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్

ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా గ్రీవెన్స్కు వచ్చిన ఆయా గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. డీఎల్డీఓ బాలకృష్ణారెడ్డి, డీఎల్పీఓ తిమ్మక్క, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
News July 7, 2025
తిరుపతి: ఎవరు లేని వారికి దేవుడే దిక్కు..!

నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి బస్టాండు, రైల్వే స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి వరకు పదులసంఖ్యలో కొందరు అక్కడే తిని అక్కడే పడుకుంటారు. వీరిలో కొందరు మద్యం మత్తులో గొడవలు పడి <<16976933>>హత్య<<>>లు, హత్యాయత్నాలు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో బిక్షగాళ్లు మాత్రమే ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం కొందరు సంచరిస్తూ రాత్రిపూట యాత్రికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. పోలీసులు భక్తులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.
News July 7, 2025
వెల్లలచెరువులో వ్యక్తి మృతి

సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పుట్టవారిపాలెం నుంచి వినుకొండ వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ ట్రాక్టర్ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.