News April 12, 2025
HYD: NRSCతో హైడ్రా ఒప్పందం

NRSCతో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉపగ్రహ చిత్రాలు, ఇతరాత్ర భూ వివరాలను ఉపయోగించుకొని చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం తదితర వాటికోసం NRSCతో MOU కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాలు చేశారు.
Similar News
News December 26, 2025
BPS సద్వినియోగం చేసుకోవాలి: కమిషనర్

అర్హులైన భవన యజమానులు భవన క్రమబద్ధీకరణ పథకం-2025 (BPS–2025)ను సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. 1985 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు నిర్మించిన అనధికార భవనాలు, అనుమతులకు విరుద్ధంగా చేసిన విస్తరణలు క్రమబద్ధీకరణకు అర్హమన్నారు. దరఖాస్తులు 11 మార్చి 2026లోపు www.bps.ap.gov.in ద్వారా మాత్రమే లైసెన్డ్ టెక్నికల్ పర్సనల్ (LTP) సహాయంతో సమర్పించాలన్నారు.
News December 26, 2025
KTR, హరీశ్ను బిగ్బాస్లోకి తీసుకోవాలని నాగార్జునకు లేఖ

TG: KTR, హరీశ్రావులను బిగ్బాస్లోకి తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ హోస్ట్ నాగార్జునకు లేఖ రాశారు. రాజకీయ నటులుగా వీరు పేరు ప్రఖ్యాతులు పొందారని, అబద్ధాలు ఆడి మోసం చేయడంలో వీరికి వీరే సాటి అని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దర్నీ తీసుకుంటే వచ్చే సీజన్లో రేటింగ్ అమాంతం పెరుగుతుందన్నారు. దీంతో తెలంగాణ ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని లేఖలో పేర్కొన్నారు.
News December 26, 2025
తుంగతుర్తి: మంత్రి ఉత్తమ్, భట్టిని కలిసిన గుడిపాటి నరసయ్య

కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య శుక్రవారం మంత్రి ఉత్తమ్, భట్టి విక్రమార్కను ప్రజా భవన్లో కలిశారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య ఎన్నికైన తర్వాత వారిని కలిశారు. మంత్రులు గుడిపాటికి శుభాకాంక్షలు తెలిపారు.


