News April 12, 2025
HYD: NRSCతో హైడ్రా ఒప్పందం

NRSCతో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉపగ్రహ చిత్రాలు, ఇతరాత్ర భూ వివరాలను ఉపయోగించుకొని చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం తదితర వాటికోసం NRSCతో MOU కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాలు చేశారు.
Similar News
News July 9, 2025
సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష.. గడువు పెంపు

TG: సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12వరకు పొడిగించినట్లు CMD బలరామ్ నాయక్ తెలిపారు. UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన వారు దీన్ని గమనించాలన్నారు. తొలుత ఈ నెల 7వరకు గడువు విధించగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. ఈ పథకం కింద TG అభ్యర్థులతో పాటు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రూ.లక్ష సాయం చేయనున్నారు.
News July 9, 2025
నల్లబ్యాడ్జీలతో ఎన్టీపీసీ ఉద్యోగుల నిరసన

దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఐఏన్టీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ ఉద్యోగులు, నాయకులు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నేషనల్ ఎస్సెట్ మానిటైజేషన్ పైప్లైన్ను రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టీకరణ నిలిపివేయాలని, పీఏస్యూల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
News July 9, 2025
గోదావరిఖని: సింగరేణి డైరెక్టర్ను కలిసిన అధికారుల సంఘం

సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రూను గోదావరిఖని క్యాంప్ ఆఫీస్లో సింగరేణి అధికారుల సంఘం ప్రతినిధులు ఈరోజు కలిశారు. నూతన డైరెక్టర్ (పా)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను సన్మానించారు. డైరెక్టర్ (పా) స్థాయిలో అధికారుల సంఘంతో గత నవంబర్లో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిన అంశాలపై విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెద్ది నర్సింహులు, పొనగోటి శ్రీనివాస్, బి.మల్లేశం ఉన్నారు.