News April 30, 2024
HYD: ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్!
HYD నగరం ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్ నిర్మాణం పై HMDA కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రెండు ప్రాజెక్టులకు సంబంధించి దరఖాస్తులను HMDA స్వీకరించింది. RR జిల్లా దామర్లపల్లి-533 ఎకరాలు, నందిగామ పరిధి చేగురులో 100 ఎకరాల్లో షిప్స్ నిర్మాణానికి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎన్నికల అనంతరం వేగవంతం చేయనున్నారు.
Similar News
News September 24, 2024
విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: RSP
రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను BRS నేత RSP ‘X’ ద్వారా ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ప్రభుత్వo DSC పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు ఆన్లైన్(CBT)లో నిర్వహించింది. అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా పట్టించుకోకుండా హడావుడిగా ఎగ్జామ్ నిర్వహించింది. ఇంకా రిజల్ట్స్ విడుదలచేయలేదు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు. ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు. విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని అన్నారు.
News September 24, 2024
HYD: కేంద్రమంత్రిని కలిసిన స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యే
కేంద్రమంత్రి నితీన్గడ్కరీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారులపై గడ్కరీతో స్పీకర్ చర్చలు జరిపారు. స్పీకర్తో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తదితరులు ఉన్నారు.
News September 24, 2024
HYD: పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు!
BRS పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలకు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ మార్పుపై 4 వారాల్లోగా వివరణతో కూడిన ఆపిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయింపు చట్టం మేరకు వారిని డిస్క్వాలిఫై చేయాలని ఆయన కోరారు.