News March 17, 2024
HYD: ప్రధాని పర్యటన.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు

HYD నగరంలో ఈ నెల 17, 18న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. PM ఈ నెల 17న బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్భవన్ వెళ్లనున్న నేపథ్యంలో రాత్రి 7.40 నుంచి 8.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 18న PM రాజ్భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. దీంతో ఉదయం 9.50 నుంచి 10.20 గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
Similar News
News February 1, 2026
బడ్జెట్: HYD అభివృద్ధికి కొత్త ఊపిరి

నేడు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ HYD అభివృద్ధికి కొత్త ఊపిరి పోసింది. ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ కింద ప్రకటించిన రూ.1 లక్ష కోట్ల గ్రాంట్లో HYD మెట్రో ఫేజ్-2 (Phase IIA & IIB) విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. RRR దక్షిణ భాగానికి లైన్ క్లియర్ చేయడంతో పాటు, రూ.40వేల కోట్లు సెమీకండక్టర్ మిషన్ 2.0లో నగరానికి పెద్దపీట వేశారు. ‘బయోఫార్మా శక్తి’ కింద రూ.10వేల కోట్లు కేటాయించారు.
News February 1, 2026
HYD: నగరవాసుల ‘చూపంతా ఆ మంత్రిపైనే’

2026 BUDGETపై HYD గంపెడాశలు పెట్టుకుంది. ప్రభుత్వం ఇప్పటికే రూ.44000CR అంచనాతో మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. అలాగే RRR దక్షిణ భాగానికి జాతీయ హోదా, రూ.34,367CR నిధుల కోసం చూస్తోంది. నిన్నే GHMC నగరాభివృద్ధికి రూ.11,460CR భారీ బడ్జెట్ను ఆమోదించింది. మూసీ పునరుజ్జీవం, ఎయిర్పోర్టులు , సెమీకండక్టర్ మిషన్లో భాగస్వామ్యంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేస్తుందోనని నగరం ఆసక్తిగా చూస్తోంది.
News February 1, 2026
సిట్ విచారణకు KCR.. సిటీలో BRS ప్లాన్ ఇదే?

నేడు KCR సిట్ విచారణ నేపథ్యంలో నగరంలో BRS నేతలు భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్లో ఉన్న KCR ఉదయం 11 గంటలకు నందినగర్లోని నివాసానికి రానున్నారు. అయితే, KCR మీద కక్ష పూరితంగా ప్రభుత్వం విచారణకు పిలుస్తోందని BRS నేతలు ఇప్పటికే ఖండించారు. అన్ని ఏరియాల్లో నిరసన తెలపాలని మరోవైపు KTR పిలుపునిచ్చారు. సిటీలో BRS నేతలు బల ప్రదర్శన చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.


