News February 1, 2025
HYD: R&B ఛీప్ ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి నివాసంలో సమావేశం

ఆర్ & బీ ఛీఫ్ ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. అటవీ అనుమతులతో పెండింగ్లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రహదారి, భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే, మరిన్ని నిధులు సాధించవచ్చని అధికారాలకు మంత్రి దిశానిర్ధేశం చేశారు.
Similar News
News February 15, 2025
HYD: అలా కనిపిస్తే ఫిర్యాదు చేయండి: డిజీ

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్రమంగా మెడిసిన్ నిల్వలు, తయారీ, విక్రయాలు జరిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని DCA డీకే కమలాసన్ రెడ్డి సూచించారు. 18005996969కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం అందినా తమకు తెలియజేయాలని సూచించారు.
News February 15, 2025
HYDలో పెరిగిన 100 వాటర్ ట్యాంకర్లు

గ్రేటర్ HYD మహానగర వ్యాప్తంగా వాటర్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా 100 ట్యాంకర్లను కొత్తగా జలమండలి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీంతో ట్యాంకర్ల సంఖ్య 949కి చేరింది. ప్రస్తుతం 78 ఫీలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరో 126 ఫీలింగ్ పాయింట్లు ఉన్నాయి. తాజాగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్ పెరిగినట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News February 14, 2025
HYD: కుంభమేళా టూర్.. యువకుడి మృతి (PHOTO)

ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు బయలుదేరిన రంగారెడ్డి జిల్లా వాసులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొంగరకలాన్కు చెందిన వనం సంపత్ రాణా, వనం శ్రీనివాస్, చంద్రశేఖర్, రమేశ్, సాయి కారులో బయల్దేరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ శివారులో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో <<15456821>>సంపత్ రాణా<<>> అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. మృతుడి ఫైల్ ఫొటో పైన చూడొచ్చు.