News March 18, 2024
HYD: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. HYD జిల్లాలో 361 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 76,575 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
Similar News
News January 10, 2026
హైదరాబాద్: పాలనలో కొత్త అధ్యాయం

HYD నగర పాలనలో ఒక భారీ శకం ముగిసి, కొత్త అధ్యాయం మొదలైంది. GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ ఇప్పటికే 100 % పూర్తయింది. లోపల జరగాల్సిన ఫైల్ వర్క్, వార్డుల పునర్విభజన అంతా సైలెంట్గా క్లోజ్ చేసేశారు. వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ పాలనాపరమైన కేటాయింపులు కూడా ముగిశాయి. ముగ్గురు సీనియర్ సిటీ ప్లానర్లకు బాధ్యతలు అప్పగిస్తూ GHMC ఉత్తర్వులు జారీ చేయడం విభజన పూర్తయిందనడానికి బలమైన సాక్ష్యం.
News January 10, 2026
HYD: DANGER.. చిన్నపిల్లలకు ఈ సిరప్ వాడొద్దు

చిన్నపిల్లలకు ఇచ్చే ‘అల్మాంట్-కిడ్’ సిరప్ విషయంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కీలక హెచ్చరిక జారీ చేసింది. బిహార్కు చెందిన ట్రైడస్ రెమెడీస్ ఉత్పత్తి చేసిన ఈ మందులో (బ్యాచ్: AL-24002) ప్రాణాంతకమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల వద్ద ఈ బ్యాచ్ సిరప్ ఉంటే వెంటనే 1800-599-6969 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. దీన్ని తక్షణమే వాడకం నిలిపివేయాలన్నారు.
News January 10, 2026
HYD: తెలుగు రాష్ట్రాల్లో ఏకైక అద్భుత ఆలయం

చారిత్రక నేపథ్యం ఉన్న ఘట్కేసర్ (M) ఏదులాబాద్లోని మన్నారు గోదాదేవి సమేత రంగనాథస్వామి దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. TG,APలో ఏకైక ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. ఈఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పలదేశికుడికి ఆండాళ్ దేవికలలో దర్శనమిచ్చి ఆలయ నిర్మాణానికి ఆదేశించింది. జమీందారుల విరాళాలతో గుడి నిర్మాణం సాధ్యమైంది. సంతానప్రదాయినిగా గాజులమ్మను కొలుస్తారు. నాగుల పంచమినాడు మట్టిగాజులు సమర్పిస్తారు.


