News September 17, 2025
HYD: SEP 17.. పేర్లు మార్చిన పార్టీలు!

ఆపరేషన్ పోలోలో భాగంగా 1948, SEP 17న HYD సంస్థానం భారత్లో విలీనమైంది. ఇది జరిగి 77 ఏళ్లు పూర్తయినా ఏటా కొత్త చర్చనే. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని INC, విమోచనమని BJP అధికారికంగా వేడుకలు చేస్తోంది. ఇక సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, జాతీయ సమైక్యత అని BRS-MIM నేతలు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. తీరొక్క పేరుతో ఒకే కార్యక్రమం చేయడం గమనార్హం.
Similar News
News September 17, 2025
HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
News September 17, 2025
JNTUలో 198 ఎంటెక్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

JNTU యూనివర్సిటీలో ఎంటెక్ విభాగానికి సంబంధించి స్పాన్సర్ క్యాటగిరీలో స్పాట్ అడ్మిషన్లకు అధికారుల సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి 20 వరకు యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలో 198 సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.6 గంటల వరకు అడ్మిషన్లకు సంబంధించి ప్రక్రియ నిర్వహిస్తామని ఆయన అన్నారు.
News September 17, 2025
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద సంచిలో మహిళ డెడ్బాడీ

చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు ఆమెను హత్య చేసి, సంచిలో కుక్కి ఆటో స్టాండ్ వద్ద పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.