News July 22, 2024
HYD: STP పనులను పరిశీలించిన కమిషనర్ ఆమ్రపాలి కాట
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721636599361-normal-WIFI.webp)
జీడిమెట్ల డివిజన్ పరిధి వెన్నెలగడ్డలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP) పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్తో కలిసి సోమవారం పరిశీలించారు. STP పరిసరాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ నెల 27న CM రేవంత్ రెడ్డి ఈ ప్లాంటును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.
Similar News
News December 26, 2024
రేపు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735219448092_51916172-normal-WIFI.webp)
బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో రేపు బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి నాయకులు, 40కి పైగా బీసీ సంఘాలు పాల్గొననున్నారు. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 10 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.
News December 26, 2024
HYD: ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ను ఖండించిన KTR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735191765031_51765059-normal-WIFI.webp)
BRS రాష్ట్ర నేత <<14984793>>ఎర్రోళ్ల శ్రీనివాస్ను<<>> పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. BRS పార్టీకి కేసులేమి కొత్త కాదన్నారు.
News December 26, 2024
HYD: ఫిబ్రవరి 3న లక్ష డప్పుల మహాప్రదర్శన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735178750827_60421583-normal-WIFI.webp)
ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని 2025, ఫిబ్రవరి 3న HYDలో జరిగే వెయ్యి గొంతులు, లక్ష డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని గురువారం MRPS, MSF, MSP అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు కోరారు. దీనికి సంబంధించిన సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లోతుకుంటలోని శుభశ్రీ గార్డెన్లో జరుగుతుందని, ముఖ్యఅతిథిగా దండోరా దళపతి మందకృష్ణ మాదిగ హాజరువుతారన్నారు.