News October 25, 2024
HYD టు యాదాద్రి.. ఇక MMTS రైలు సర్వీస్

HYD నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులు ఇక MMTS సర్వీస్ను ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్రం నిర్ణయించిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇది యాదాద్రి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. MMTS ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.800కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం సహకరించకపోయినా సెకండ్ ఫేజ్ కింద సర్వీస్ను పొడిగిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 13, 2025
39పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 39 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ, CA/ICWAI, డిప్లొమా, బీఎస్సీ(MPC), ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష(CBT), ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bvfcl.com/
News November 13, 2025
ప్రతి ఒక్కరూ వేదాలను ఎందుకు చదవాలి?

వేదాలు దైవిక నాదస్వరూపాలు. వీటిని రుషులు లోకానికి అందించారు. ఇవి మంత్రాల సముదాయం మాత్రమే కాదు. మనిషి జీవితానికి మార్గదర్శకాలు కూడా! ఇవి మనల్ని అసత్యం నుంచి సత్యానికి నడిపిస్తాయి. చీకటి నుంచి వెలుగు వైపుకు తీసుకెళ్తాయి. మృత్యువు నుంచి మోక్షం వైపుకు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తాయి. నిత్య జీవితంలో ధైర్యాన్ని, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి వేదాలు తోడ్పడతాయి. <<-se>>#VedikVibes<<>>
News November 13, 2025
రండి.. ట్రైనింగ్ ఇచ్చి వెళ్లిపోండి: అమెరికా

H1B వీసా విధానంపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన కామెంట్లు చేశారు. ‘విదేశాల నుంచి వచ్చే వారిపై ఎక్కువ కాలం ఆధారపడకుండా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. దానికోసం తాత్కాలికంగా విదేశీ కార్మికులను యూఎస్ తీసుకురావడమే H1B వీసా కొత్త విధానం. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. తరువాత తిరిగి వెళ్లిపోండి. జాబ్స్ అన్నీ అమెరికన్లే తీసుకుంటారు’ అని చెప్పారు.


