News March 21, 2024
HYD: UPDATE: లవ్లో కూతురు.. ఉరేసి చంపిన తల్లి జైలుకు

ఇబ్రహీంపట్నం మం. దండుమైలారంలో కూతురిని చంపిన తల్లికి పోలీసులు రిమాండ్ విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బావను పెండ్లి చేసుకోవాలని పేరెంట్స్ భార్గవి(19) మీద ఒత్తిడి తెచ్చారు. ఇది ఆమెకు నచ్చలేదు. మంగళవారం శశి(ప్రియుడు)ని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ చూసింది. కోపంతో కూతురిని కొట్టి, చీరతో ఉరేసి చంపేసింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జంగమ్మను అరెస్ట్ చేశారు.
Similar News
News April 17, 2026
HYD: 3 రక్షణ కమిటీలు.. ఆక్రమణదారుల కోసమేనా? (3)

చెరువులను కాపాడతామని 2018లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసిన సర్కారు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. FTL మార్కింగ్, ఫెన్సింగ్ అంతా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్లో బడా బాబులు ఓ చెరువును మింగేస్తుంటే అధికారులు <<19672685>>’పరిశీలిస్తాం’<<>> అంటూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడాలు కూల్చే ధైర్యం అధికారులకు లేదా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? దీనిపై దర్యాప్తు జరగాల్సిందే!
News April 17, 2026
బాంబు కాదు: ఉప్పల్ మెట్రో స్టేషన్ చెత్త డబ్బాలో టపాసులు: పోలీసులు

ఉప్పల్ మెట్రో స్టేషన్లో బాంబు బెదిరింపు వార్తలపై పోలీసులు స్పందించారు. చెత్త డబ్బాలో టపాసులు ఉన్నట్లు గమనించిన సిబ్బంది మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై PSకు కాల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెట్రో స్టేషన్ను తనిఖీ చేయగా, అవి వేడుకల్లో వాడే టపాకాయలని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
News April 17, 2026
గంటలోపు ఆసుపత్రికి చేరిస్తే రూ.25వేల రివార్డు: మంత్రి

నాగోల్ డ్రైవింగ్ సెంటర్లో ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రమాద బాధితులను గంటలోపు ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడితే రూ.25వేల నగదుతో ‘రహవీర్ అవార్డు’ ఇస్తామని ప్రకటించారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.


