News March 21, 2024
HYD: UPDATE: లవ్లో కూతురు.. ఉరేసి చంపిన తల్లి జైలుకు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710996727655-normal-WIFI.webp)
ఇబ్రహీంపట్నం మం. దండుమైలారంలో కూతురిని చంపిన తల్లికి పోలీసులు రిమాండ్ విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బావను పెండ్లి చేసుకోవాలని పేరెంట్స్ భార్గవి(19) మీద ఒత్తిడి తెచ్చారు. ఇది ఆమెకు నచ్చలేదు. మంగళవారం శశి(ప్రియుడు)ని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ చూసింది. కోపంతో కూతురిని కొట్టి, చీరతో ఉరేసి చంపేసింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జంగమ్మను అరెస్ట్ చేశారు.
Similar News
News July 3, 2024
HYD: అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719980869954-normal-WIFI.webp)
HYD నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ డా.వరలక్ష్మీ తెలిపారు. ఆంగ్లం, అరబిక్, ఉర్దూ మీడియం(హిస్టరీ), కామర్స్, BBA, BBA ఈ-కామర్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, స్టాటిస్టిక్స్, జువాలజీలో అర్హులైనవారు ఈనెల 5 వరకు కాలేజీలో దరఖాస్తులు చేసుకోవాలని, 6న ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.
News July 3, 2024
HYD: వీరిలో ఒకరికి మంత్రి పదవి?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719973073908-normal-WIFI.webp)
ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దీంతో మంత్రి పదవి కోసం RR జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం MLA మల్రెడ్డి రంగారెడ్డి, HYD నుంచి ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చేతి గుర్తుపై గెలిచిన వారికే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందని ఇటీవల సీఎం చెప్పడంతో దానం ఆశలు సన్నగిల్లాయి. కాగా గతంలో దానంకు రేవంత్ రెడ్డి మాట ఇవ్వడంతో ఆశతో ఉన్నారు.
News July 3, 2024
గోల్కొండ దేవాలయ ఛైర్మన్గా అరవింద్ మహేశ్ కుమార్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719972178387-normal-WIFI.webp)
చారిత్రాత్మక గోల్కొండ కోట శ్రీజగదాంబిక మహంకాళి దేవాలయ ఛైర్మన్గా అరవింద్ మహేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ 14 మంది సభ్యులతో కూడిన బోనాల ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసి ఉత్తర్వులను జారీ చేశారు. సభ్యులందరూ అరవింద్ మహేశ్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోనాల ఉత్సవాల కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు.