News August 27, 2024

HYD: UPSC ప్రిలిమ్స్.. రాష్ట్రంలో RR జిల్లా టాప్!

image

UPSC ప్రిలిమ్స్ పరీక్షలో TG రాష్ట్రంలోనే గరిష్ఠంగా RR నుంచి 14 మంది, మేడ్చల్ నుంచి 11, HYD నుంచి ముగ్గురు, వికారాబాద్ నుంచి ఒకరు, మొత్తంగా 29 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన ఒక్కొకరికి ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట సోమవారం సీఎం రేవంత్ రెడ్డి రూ.లక్ష విలువ చేసే చెక్కులను అందజేశారు. మెయిన్స్ పరీక్షలో పాసై ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయితే మరో రూ.లక్ష అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.

Similar News

News November 19, 2025

HYD: 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

image

నవంబర్ 12 నుంచి 18వరకు జరిగిన ఆపరేషన్‌లో 11కేసులను ఛేదించి దేశ వ్యాప్తంగా 18మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ట్రేడింగ్ మోసాలను కట్టడి చేస్తూ 15మందిని పట్టుకున్నారు. హెటెరో కంపెనీపై 250 మిలియన్ డాలర్ల భారీ ఎక్స్‌టోర్షన్‌కు ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నకిలీ మెయిల్స్, ఫేక్ USFDA డాక్యూమెంట్లతో గ్యాంగ్ బెదిరించిందన్నారు.

News November 19, 2025

17వ వార్షికోత్సవంలోకి ట్రూ జోన్ సోలార్

image

తెలంగాణకు చెందిన పాన్-ఇండియా సోలార్ కంపెనీ అయిన ట్రూజోన్ సోలార్ (సుంటెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్) బుధవారంతో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో 17వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కొన్ని సంవత్సరాలుగా ట్రూజోన్ దేశంలోని అత్యంత విశ్వసనీయ సోలార్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించింది. కస్టమర్-ఫస్ట్ విధానంతో ట్రూజోన్ సోలార్ భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడానికి కట్టుబడి ఉంది.

News November 19, 2025

HYD: ప్రజాభవన్‌లో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

image

HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఈరోజు నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను రూపుమాపేలా నిపుణులు, మేధావులు, అధికారుల సలహాలు తీసుకుంటామని చెప్పారు.