News June 27, 2024

HYD- విజయవాడ హైవే విస్తరణకు మోక్షం

image

హైదరాబాద్- VJA హైవే విస్తరణకు అడ్డంకులు తొలగనున్నాయి. 2010లో టెండర్ దక్కించుకున్న GMR 4లైన్ల హైవే నిర్మించింది. 2024 వరకు 6 లైన్లు చేయాలనే ఒప్పందముంది. అయితే AP, TG విభజన కారణంగా నష్టం వస్తోందని GMR కోర్టుకెళ్లగా విస్తరణ పనులు ఆగిపోయాయి. తాజాగా GMR, NHAI మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. ఆ సంస్థకు నష్ట పరిహారం ఇచ్చేందుకు NHAI ఒప్పుకోగా.. గడువుకి ముందే టోల్ వసూలు బాధ్యతల నుంచి GMR తప్పుకోనుంది.

Similar News

News October 10, 2024

రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

image

ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో ఓ టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి 2 మ్యాచుల్లో ఒకటి ఆడకపోవచ్చని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. సిరీస్ ప్రారంభానికి ముందే తన పనులు పూర్తయితే అన్ని టెస్టులు ఆడే అవకాశం ఉంది. రోహిత్ దూరమైతే అభిమన్యు ఈశ్వరన్ ఆడే అవకాశం ఉందని సమాచారం.

News October 10, 2024

భారీగా ‘సిప్’ చేస్తున్నారు.. సెప్టెంబర్‌లో రికార్డు

image

దేశంలో మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెరుగుతున్నాయి. మొద‌టిసారిగా ఒక నెల‌లో ₹ 24,508.73 కోట్లకు పెట్టుబ‌డులు చేరుకున్న‌ట్టు AMFI వెల్ల‌డించింది. ఆగ‌స్టు నెల‌లో న‌మోదైన ₹23,547.34 కోట్లతో పోలిస్తే ఇది 4% అధికం. సెప్టెంబ‌ర్‌లో 66,38,857 కొత్త సిప్‌లు న‌మోద‌య్యాయి. AUMలు గరిష్ఠ స్థాయి ₹13.81 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం SIP ఖాతాల సంఖ్య ఆగస్టులో 9.61 కోట్ల నుంచి 9.8 కోట్ల‌కు చేరుకుంది.

News October 10, 2024

బీజేపీ నేతల్ని హెచ్చరించిన మావోయిస్టులు

image

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఛత్తీస్‌గ‌ఢ్ బీజేపీ నేత‌ల్ని మావోయిస్టులు హెచ్చ‌రించారు. పార్టీ విస్త‌ర‌ణ చ‌ర్య‌లు నిలిపివేయాల‌ని బీజేపీ నేతలు వెంకటేశ్వర్, బిలాల్ ఖాన్‌లను బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల మాడెడ్ ఏరియా కమిటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. దీంతో బీజాపూర్‌, సుక్మా జిల్లాల్లో బీజేపీ మెంబ‌ర్‌షిప్ డ్రైవ్‌ నిలిచిపోయింది.