News March 16, 2024

HYD: ఏసీబీ వలలో జలమండలి అధికారులు

image

రెవెన్యూ సర్కిల్ జలమండలి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేశ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్‌ను అక్బర్ హుస్సేన్ అనే వ్యక్తి కలిశారు. తన పని అవ్వాలంటే రూ.లక్ష లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్బర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు రాకేశ్ దొరికాడు. నాంపల్లి ఏసీబీ కోర్టులో వారిని హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. 

Similar News

News November 18, 2025

HYD: శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక

image

శబరిమల యాత్రకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప స్వాములకు కీలక సూచన. ఇకపై ఎయిర్‌పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్‌లో ఇరుముడు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్‌లో మాత్రమే ఉంచాలి. చివరి నిమిషంలో అసౌకర్యం ఎదురుకాకుండా ముందస్తుగా ఈ సూచనలను పాటించాలని కొందరు స్వాములు Way2News ద్వారా ఇతర భక్తులకు తెలియజేస్తున్నారు.SHARE IT

News November 18, 2025

HYD: శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక

image

శబరిమల యాత్రకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప స్వాములకు కీలక సూచన. ఇకపై ఎయిర్‌పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్‌లో ఇరుముడు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్‌లో మాత్రమే ఉంచాలి. చివరి నిమిషంలో అసౌకర్యం ఎదురుకాకుండా ముందస్తుగా ఈ సూచనలను పాటించాలని కొందరు స్వాములు Way2News ద్వారా ఇతర భక్తులకు తెలియజేస్తున్నారు.SHARE IT

News November 17, 2025

రంగారెడ్డి: కలెక్టర్ గారూ.. ప్రభుత్వ బోర్డు మాయమైంది!

image

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో అక్రమార్కుల దృష్టిలో అలుసైపోతున్నారని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు గంటిల వెంకటేశ్ ఆరోపించారు. మంచాల మం. ఆగపళ్లి గ్రామ పంచాయతీలోని సర్వే నం.191లో అధికారులు ఏర్పాటు చేసిన రక్షణ బోర్డు 2 రోజులకే మాయమైంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు.