News March 16, 2024
HYD: ఏసీబీ వలలో జలమండలి అధికారులు

రెవెన్యూ సర్కిల్ జలమండలి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేశ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్ను అక్బర్ హుస్సేన్ అనే వ్యక్తి కలిశారు. తన పని అవ్వాలంటే రూ.లక్ష లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్బర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు రాకేశ్ దొరికాడు. నాంపల్లి ఏసీబీ కోర్టులో వారిని హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది.
Similar News
News October 16, 2025
జూబ్లీ సాక్షిగా సర్కారుపై పోరుకు సిద్ధం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 22 నెలల 9 రోజులైంది. ఈ లోపే పలువురు సర్కారుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసి ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని బాధితులు బహిరంగంగా ప్రకటించారు. RRR, లగచర్ల భూసేకరణ, ఫార్మాసిటీ బాధితులు, గ్రూప్-1 అభ్యర్థులు, మాలసంఘాల నాయకులు నామినేషన్లు వేసి నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు. వీరందరి పోరు ఎవరికి నష్టమో తెలియాలి.
News October 16, 2025
HYD: నామినేషన్ ఇప్పుడు పార్ట్ టైమ్ బిజినెస్

ఎన్నికలంటే ఎంతోమంది నామినేషన్లు వేయడం చూస్తుంటాం. వీరిలో కొందరు పేరు కోసం వేస్తే.. మరికొందరు స్వలాభం కోసం వేస్తారు. పేరుకోసం వేసేవారు తాను ఇన్నిసార్లు నామినేషన్ ఫైల్ చేశా అని చెప్పకోవడానికి, ఇంకొందరు ఓట్లు చీల్చడానికి స్వలాభంతో పోటీలో దిగుతారు. దీంతో గెలుపు అవకాశాలు కొందరికి తగ్గిపోతాయి. అందుకే గెలిచే అభ్యర్థి ఇచ్చే డబ్బుతో విత్ డ్రా చేసుకుంటారన్నమాట. ఇప్పుడుదే ట్రెండ్ర్ జూబ్లీలో కొనసాగుతోందా?
News October 16, 2025
జూబ్లీహిల్స్ బై పోల్.. ROAD TO జీహెచ్ఎంసీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గ్రేటర్ ఎన్నికలకు బాటవేయనున్నాయి. అందుకే కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీలు జూబ్లీహిల్స్ బై పోల్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలిచి గ్రేటర్ను హస్తగతం చేసుకోవాలని అధికార పార్టీ.. ఎలాగైనా విజయం సాధించి గ్రేటర్పై పట్టుపోలేదని నిరూపించాలని బీఆర్ఎస్.. అప్పుడు 48 డివిజన్లు గెలిచాం.. జూబ్లిహిల్స్లో కాషాయజెండా ఎగురవేసి గ్రేటర్ పీఠం ఎక్కాలని బీజేపీ భావిస్తున్నాయి.