News August 10, 2024

HYD: Way2 News కథనంపై స్పందించిన రిజిస్ట్రార్

image

PHD ఫలితాల విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ అనే శీర్షికపై Way2 Newsలో వచ్చిన కథనానికి JNTU యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందించారు. సోమవారం PHD ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని దానికి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Similar News

News September 16, 2025

HYD: బదులేనిదీ ప్రశ్న.. పిల్లలకెందుకీ శిక్ష?

image

ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో డ్రగ్స్ తయారీ చేస్తుండటంతో పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యజమాని చేసిన తప్పుకు అతడిని శిక్షించి పాఠశాల నిర్వహణను వేరేవారికి ఇవ్వవచ్చు కదా అనేది తల్లిదండ్రుల ప్రశ్న. జరిగింది ముమ్మాటికీ తప్పే.. దీనికి విద్యార్థులను ఎందుకు శిక్షించడం అనేది తల్లిదండ్రుల వర్షన్. అధికారులేమో ప్రత్యామ్నాయం చూపిస్తాం అంటున్నారు.

News September 16, 2025

మియాపూర్: డ్యూటీలో గుండెపోటుతో కండక్టర్ మృతి

image

మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కండక్టర్ పండరి గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. సహోద్యోగులతో సరదాగా మాట్లాడుతూ పండరి వాష్‌రూమ్‌కి వెళ్లొస్తానని వెళ్లాడు. వెంటనే అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో సహోద్యోగులు అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు.

News September 16, 2025

HYD: పర్మిషన్ ఇస్తే సరిపోతుందా? తనిఖీలు..!

image

ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ వ్యవహారం సిటీలో కలకలం రేపింది. ప్రైవేట్ స్కూళ్లలో దందా జరుగుతోంటే అధికారులు ఏం చేస్తున్నారో? సిటీలో అసలు ప్రైవేట్ బడులను విద్యాశాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ ఇచ్చాం.. అయిపోయింది.. అసలేం జరుగుతోందనే విషయం ఆలోచించడం లేదు. అందుకే ఈ దౌర్భాగ్యం అని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరేం అంటారు?