News August 10, 2024

HYD: Way2 News కథనంపై స్పందించిన రిజిస్ట్రార్

image

PHD ఫలితాల విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ అనే శీర్షికపై Way2 Newsలో వచ్చిన కథనానికి JNTU యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందించారు. సోమవారం PHD ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని దానికి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Similar News

News November 30, 2025

రంగారెడ్డి: మొదటి రోజు 450 నామినేషన్లు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు కందుకూరు, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 450 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో 178 పంచాయతీ స్థానాలకు 152 నామినేషన్ దాఖలు కాగా 1540 వార్డు స్థానాలకు 298 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.

News November 30, 2025

HYD: సీఎం పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన కవిత

image

సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. “ఎన్నికలు గ్రామాల్లో ఉంటే, సీఎం జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట. ప్రజలను ప్రభుత్వ సొమ్ముతో తరలించడం ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమే. ఎన్నికల కమిషన్ సీఎం పర్యటనను నిలిపివేయాలి” అని డిమాండ్ చేశారు.

News November 30, 2025

రంగారెడ్డి జిల్లాలో సర్పంచ్‌లకు 929 నామినేషన్లు

image

తొలి విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం నుంచి రెండో విడత మొదలుకానుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా రెండు డివిజన్లు, ఏడు మండలాల పరిధిలోని 174 సర్పంచ్ స్థానాలు, 1,530 వార్డులకు నామినేషన్లను ఆహ్వానించగా.. సర్పంచ్‌కు 929 నామినేషన్లు, వార్డులకు 3,327 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ మూడో తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగనుంది.