News February 1, 2025

HYD: WOW.. త్వరలో అద్భుతమైన పార్క్ ఓపెన్!

image

HYD నగరంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న హిమాయత్ సాగర్, కొత్వాల్ గూడ పార్క్ త్వరలో ఓపెన్ కానుంది. దాదాపుగా 1000 రకాల పక్షులతో పక్షిశాలను సైతం సిద్ధం చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారిక యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఎక్వేరియం, పిక్నిక్ పార్కు, రిసార్టులు, అడ్వెంచర్లు, ఫుడ్ కోర్టులు, ఓపెన్ థియేటర్లు అందుబాటులో ఉంచారు.

Similar News

News February 9, 2025

HYD: చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ (PHOTO)

image

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణాలు పోసింది ఓ డాక్టర్. నార్సింగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యశ్వంత్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇదే యాక్సిడెంట్‌లో డా. నంగి భూమిక(24) తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్‌దాన్‌ బృందం ఐదుగురు పేషంట్లకు ఆర్గాన్లు అవసరమని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. భూమిక గుండె, లీవర్, కళ్లు, కిడ్నీలను దానం చేసి ఐదుగురికి ప్రాణం పోశారు.

News February 9, 2025

UPDATE: HYD: ఆస్తి కోసమే తాత హత్య!

image

ఆస్తి గొడవల కారణంగా వ్యాపారవేత్త జనార్దన్ రావును మనవడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వెల్జాన్ గ్రూప్‌లో ఓ మనవడికి జనార్దన్ డైరెక్టర్ పోస్టును ఇచ్చాడు. తనకు ఏం ఇవ్వలేదని కోపం పెంచుకున్న కీర్తి తేజ తాతపై 73 సార్లు కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా అటాక్ చేసి ఏలూరుకు పారిపోయాడు. పోలీసులు నిందితుడిని ఏలూరులో అరెస్ట్ చేశారు.

News February 9, 2025

HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!

image

నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్‌ చేశారు.

error: Content is protected !!