News January 25, 2025
HYD: WOW.. పట్టణం మధ్యలో పచ్చదనం..!

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో పట్టణం మధ్యలో 120 ఎకరాల్లో పచ్చని అద్భుతమైన శాంతివనం పార్క్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇంత పెద్ద పట్టణానికి ఈ పచ్చని పార్క్ ఒక వరంగా పర్యావరణ ప్రేమికులు అభివర్ణిస్తున్నారు. వాకింగ్ ట్రాక్, క్రీడా ప్రాంగణం, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ఏరియా ఇలా ఎన్నో సదుపాయాలు పార్క్ సొంతం. పల్లెటూరి వాతావరణం ఆస్వాదించి, ఆరోగ్యం పొందేందుకు ఇదొక చక్కటి ప్రాంతం. మంత్లీ పాస్ కూడా ఉంది.
Similar News
News February 13, 2025
RCB కెప్టెన్గా రజత్ పాటిదార్?

IPL-2025 సీజన్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ తమ కెప్టెన్ను ప్రకటించనుంది. రజత్ పాటిదార్ను కెప్టెన్గా ఖరారు చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాటిదార్ కెప్టెన్గా మెప్పించారు. మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్కు చేర్చారు. 2021 నుంచి RCBకి ఆడుతున్నారు. కాగా కోహ్లీ తిరిగి RCB కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారని గత కొంతకాలంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News February 13, 2025
రజినీకాంత్పై RGV కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్

రజినీకాంత్పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ‘క్యారెక్టర్ను బట్టి నటన ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టార్లవుతారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రజినీ గొప్ప నటుడా? నాకు తెలిసి భిఖు మాత్రే పాత్రను(సత్యలో మనోజ్ బాజ్పేయి) ఆయన చేయలేడు. ఆయన ఏం చేయకపోయినా స్లో మోషన్లో నడిచొస్తే చాలు ప్రేక్షకులు చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో RGV అన్నారు. దీంతో ఆయనపై రజినీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
News February 13, 2025
చేగుంట: తండ్రి మందలించడంతో కొడుకు సూసైడ్

చేగుంట మండలం వడియారం గ్రామంలో మద్యం తాగొద్దని తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఘన బోయిన శివకుమార్ అలియాస్ శివుడు(30) నిన్న రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో శివుడు ఇంట్లోంచి బయటకు వెళ్లి పురుగు మందు తాగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఇవాళ మృతి చెందాడు.