News February 1, 2025
HYD: WOW.. త్వరలో అద్భుతమైన పార్క్ ఓపెన్!
HYD నగరంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న హిమాయత్ సాగర్, కొత్వాల్ గూడ పార్క్ త్వరలో ఓపెన్ కానుంది. దాదాపుగా 1000 రకాల పక్షులతో పక్షిశాలను సైతం సిద్ధం చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారిక యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఎక్వేరియం, పిక్నిక్ పార్కు, రిసార్టులు, అడ్వెంచర్లు, ఫుడ్ కోర్టులు, ఓపెన్ థియేటర్లు అందుబాటులో ఉంచారు.
Similar News
News February 1, 2025
గ్రేటర్ HYDలో గాలి నాణ్యత కేంద్రాలు ఉన్నవి అక్కడే!
గ్రేటర్ HYDలో గాలి నాణ్యతను పరీక్షించేందుకు ఉన్న కేంద్రాల లిస్టును CPCB అధికారులు వెల్లడించారు. న్యూ మలక్పేట, నాచారం-TSIIC, సోమాజిగూడ, ఈసీఐఎల్- కాప్రా, కొంపల్లి, కోకాపేట, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సనత్ నగర్, ఇక్రిశాట్, పటాన్ చెరు, జవహర్ జూపార్క్ మొత్తంగా ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎయిర్ పొల్యూషన్ చెక్ చేస్తున్నట్లు తెలిపారు.
News February 1, 2025
సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్
సికింద్రాబాద్ వారసిగూడ <<15327304>>మహిళ మృతి <<>>కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు. నాలుగేళ్లుగా మేనమామతోనూ వారికి గొడవ ఉందని స్థానికులు తెలిపారు.
News February 1, 2025
HYDలో హృదయవిదారక ఘటన
HYDలోని వారాసిగూడ PSపరిధిలో ఇంట్లో <<15323241>>తల్లి మృతదేహంతో<<>> ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే బౌద్ధనగర్లోని ఓ ఇంట్లో నివాసముంటూ తల్లి ఇద్దరు కూతుర్లను చూసుకుంటోంది. తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. గత కొద్దిరోజులుగా తల్లి లలిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 9రోజులుగా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని ఉండిపోగా.. ప్రస్తుతం ఆ పిల్లలు తల్లిలేక అనాథలయ్యారు.