News February 12, 2025
HYD: WOW.. 250 ఎకరాల్లో పచ్చని పార్క్..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739319096190_15795120-normal-WIFI.webp)
HYD చేరువలో RR జిల్లా నార్సింగి మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్కింగ్ పార్కులో ప్రతి శనివారం నేచర్ క్యాంపులు జోరుగా సాగుతున్నాయి. ఈ పార్కు 250 ఎకరాల్లో విశాలంగా విస్తరించి ఉంది. ఉ.5 గంటలకు నిద్రలేపే పక్షుల సందర్శన, ట్రెక్కింగ్ కోసం తీసుకెళ్తున్నారు. పచ్చని వాతావరణంలో అమితానందం పొంది, సకుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ఇదొక చక్కటి ప్రాంతంగా పర్యటకులు చెబుతుంటారు. #SHARE IT
Similar News
News February 12, 2025
కొల్లిపరలో భారీ కొండ చిలువ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739336837733_51150652-normal-WIFI.webp)
కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
News February 12, 2025
గుంటూరులో నేటి చికెన్ ధరలు ఇవే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739334871034_60415181-normal-WIFI.webp)
గుంటూరు జిల్లాలో పొరుగు జిల్లాలతో పోల్చుకుంటే చికెన్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంది. జిల్లాలో నేడు స్కిన్ లెస్ రూ.246, స్కిన్ రూ.236గా ఉంది. సాధారణ రోజుల్లో గుంటూరుకి ఇతర జిల్లాలకు 5, 10 రూపాయలు తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి గుంటూరుకి ఇతర జిల్లాలకు రూ.20 నుంచి రూ.25 వ్యత్యాసం కనిపిస్తోంది.
News February 12, 2025
వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739334636421_1047-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.