News April 16, 2025
HYD: అవయవ మార్పిడి.. 3,823 మంది వెయిటింగ్

అవయవ మార్పిడి కోసం ‘జీవన్ దాన్’ వద్ద 3,823 మంది నమోదు చేసుకున్నారని దాని నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపారు. NIMS, ఉస్మానియా, గాంధీ, ESI ఆస్పత్రులతో పాటు HYDలోని 41 ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తారన్నారు. అత్యధికంగా NIMSలో 620కి పైగా శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. అవయవదానం మరొకరికి పునర్జన్మలాంటిదని అభివర్ణించారు.
Similar News
News April 19, 2025
నిర్మల్లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత

నిర్మల్ జిల్లాలో శనివారం 42.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓవైపు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు అనుకోని అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం 42.5, సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News April 19, 2025
సిద్దిపేట: ఫోన్ పట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు: హరీశ్ రావు

విద్యార్థులు వేసవి సెలవుల్లో మొబైల్ ఫోన్ పట్టుకొని టైం వేస్ట్ చేయొద్దని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ‘భద్రంగా ఉండాలి- భవిష్యత్తులో ఎదగాలి’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సెలవుల్లో పుస్తక పఠనం చేసి తెలియని వాటిని తెలుసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేసుకుంటే మనకే నష్టమని అన్నారు.
News April 19, 2025
ఇషాంత్ శర్మకు వడదెబ్బ!

అహ్మదాబాద్లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు వడదెబ్బ తగిలింది. ఆయన్ను బౌండరీ లైన్ బయటికి తీసుకెళ్లిన GT సిబ్బంది, లిక్విడ్స్ అందించి తడి టవల్స్తో సపర్యలు చేశారు. స్టేడియం వద్ద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేయడంతో అటు గుజరాత్, ఇటు ఢిల్లీ జట్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం ఎండ దెబ్బకు ఇబ్బంది పడ్డారు.