News October 15, 2024
HYD: ఈ నెల 22న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు
విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్లు, మండల తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి సమావేశమయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు.
Similar News
News October 15, 2024
HYD: ‘అబ్దుల్ కలాం’ అవార్డుకు వేమూరి దంపతుల ఎంపిక
ప్రముఖ కవి, గాయకుడు వేమూరి అనంత రామకృష్ణశర్మ, ప్రముఖ లలిత సంగీత, సీని గాయని వేమూరి మంజుల దంపతులు భారతరత్న డా. APJ అబ్దుల్ కలాం అవార్డుకు ఎంపికయ్యారు. సంగీతం, సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న వేమూరి దంపతులకు ఈరోజు పినాకిని సంస్థ ఆధ్వర్యంలో HYD త్యాగరాయగానసభలో అవార్డు ప్రదానం చేయనున్నారు. MLC మధుసూదనాచారి, సీల్వెల్ కార్పొరేషన్ CMD బండారు సుబ్బారావు తదితరులు హాజరుకానున్నారు.
News October 15, 2024
HYD: విడాకులు తీసుకున్నా.. కలిసే మోసాలు
దంపతులు విడాకులు తీసుకున్నా.. కలిసే మోసాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటకకు చెందిన మహ్మద్, రేష్మ HYDకు వచ్చి జాబ్ కన్సల్టెన్సీలో పనికి కుదిరారు. 2013లో వివాహం చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నా.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు దిగారు. ఆమె మరో పెళ్లి చేసుకున్నా మోసాలు చేస్తూ పట్టుబడ్డారు. కేసు నమెదు చేసి ఫోన్లు, ల్యాప్టాప్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
News October 14, 2024
HYD: రాడార్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR
ఓ వైపు మూసీ నదికి CM మరణశాసనం రాస్తూ.. మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. 10 ఏళ్ల పాలనలో తమపై రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదని, జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్ను తెలంగాణలో ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.