News April 7, 2025
HYD: ఈషాసింగ్ను అభినందించిన సీఎం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో హైదరాబాద్కు చెందిన ఈషా సింగ్ రజత పతకం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో ఈషా సింగ్కు ఇది మొదటి పతకం కాగా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో ఇది దేశానికి మూడో పతకం.
Similar News
News April 14, 2025
జూబ్లీహిల్స్ పెద్దమ్మను దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
News April 14, 2025
‘విల్లా వెర్డే’ను ఆవిష్కరించిన సైబర్ సిటీ

హైదరాబాద్లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ సౌకర్యాలతో విల్లా వెర్డే ప్రాజెక్టును సైబర్ సిటీ సంస్థ సోమవారం ప్రారంభించింది. ఇది టెర్రస్ స్విమ్ స్పాలు, బయోఫిలిక్ డిజైన్లు, IGBC-సర్టిఫైడ్ గ్రీన్ ఆర్కిటెక్చర్తో 89 బెస్పోక్ విల్లాలను కలిగిన ప్రత్యేక ప్రాజెక్టని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 20ఏళ్ల అనుభవంతో ఈ ప్రాజెక్టు అందిస్తున్నామన్నారు. ది చార్ కోల్ ప్రాజెక్టుతో కొలాబరేషన్ను ఈ లాంఛ్ ఈవెంట్లో ప్రకటించారు.
News April 14, 2025
BREAKING.. కుషాయిగూడలో మర్డర్

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.