News March 27, 2025
HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.
Similar News
News April 1, 2025
అమెరికాలో అత్యధిక పెట్స్ ఏవంటే?

అమెరికన్లు పెంపుడు జంతువులను అమితంగా ప్రేమిస్తుంటారు. ఒక్కొక్కరి దగ్గర నాలుగైదు రకాల పెట్స్ కూడా ఉంటుంటాయి. అయితే, అత్యధికంగా కుక్కలను పెంచుకునేందుకు వారు మొగ్గుచూపుతున్నట్లు అమెరికన్ పెట్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ తెలిపింది. USలో 65 మిలియన్ల పెట్ డాగ్స్ ఉండగా 47M పిల్లులున్నాయి. ఫ్రెష్ వాటర్ ఫిష్లు 11M, చిన్న జంతువులు 7M, పక్షులు 6M, రెప్టైల్స్ 6M, సాల్ట్ వాటర్ ఫిష్ – 2M, గుర్రాలు 2M ఉన్నాయి.
News April 1, 2025
MDK: వ్యవసాయ శాఖకు కొత్త ఫోన్ నంబర్లు

మెదక్ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల నంబర్లు మారాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో పాటు సహాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, పీఏలకు సంబంధించిన అధికారుల నంబర్లు మారినట్లు జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ కుమార్ తెలిపారు. ఇదివరకు ఐడియా వొడాఫోన్ నంబర్లు ఉండగా ఎయిర్ టెల్లోకి మారాయి.
News April 1, 2025
A+ కాంట్రాక్టులోనే విరాట్, రోహిత్?

విరాట్, రోహిత్ను A+ గ్రేడ్లోనే కొనసాగించాలని BCCI భావిస్తున్నట్లు సమాచారం. మూడు ఫార్మాట్లలోనూ ఆడే క్రికెటర్లకే బీసీసీఐ A+ గ్రేడ్ను కేటాయిస్తోంది. రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వారి గ్రేడ్ను తగ్గించొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, భారత క్రికెట్కు వారందించిన సేవల దృష్ట్యా అగ్రస్థాయి కాంట్రాక్ట్లోనే కొనసాగించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.