News May 13, 2024

HYD: ఓటేసిన రాచకొండ సీపీ

image

సికింద్రాబాద్ పరిధి గోపాలపురంలో ఉన్న St.ప్యాట్రిక్ స్కూల్‌లో రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని సూచించారు. పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News October 7, 2024

లలితాదేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి

image

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజుజూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శ్రీ లలితా దేవిగా రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని లలిత సహస్రనామాలు పటిస్తున్నారు. నేడు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News October 7, 2024

HYD: ఏపీ సీఎం CBNను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

image

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు శుభలేఖను అందజేసి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.

News October 7, 2024

HYD: మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనా?: కేటీఆర్

image

సోషల్ మీడియాలో ఎల్లప్పడూ యాక్టివ్‌గా ఉంటూ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు MLA KTR. నిత్యం ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. ట్వీట్‌లు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ బడ్జెట్‌పై X వేదికగా తాజాగా స్పందించారు. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె కావాలి అన్నట్టుంది ప్రభుత్వ వైఖరి అంటూ రాసుకొచ్చారు.