News July 13, 2024
HYD: గంజాయి జాగ చెబితే రూ.2లక్షలు
HYD, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్పై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్పై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందిస్తామని నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. 100 కిలోలకుపైగా గంజాయి నిలువలు, సరఫరా సంబంధించిన సమాచారం ఇస్తే రూ.2లక్షల రివార్డు అందిస్తామన్నారు. గంజాయి ఎక్కడుందనే సమాచారం 8712671111కు వివరాలు ఇవ్వాలన్నారు.
Similar News
News September 24, 2024
HYD: ఇకపై అన్నింటికీ ఒకే డిజిటల్ కార్డు
రాష్ట్రంలో రేషన్, ఆరోగ్యం, ఇతర సంక్షేమాలన్నింటికీ ప్రతి కుటుంబానికి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండేలా ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. HYDలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల మార్పు, చేర్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఈ కార్డు రూపొందించనున్నారు. సమగ్ర కుటుంబ వివరాల నమోదుపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.
News September 24, 2024
RR: జిల్లా కోర్టులో మెగా వైద్య శిబిరం
RR జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రక్త, కంటి, దంత, చర్మ, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి మందు అందజేశారు. జిల్లా ప్రధాన జడ్జి శ్రీధర్ రెడ్డి NGOలను అభినందించారు. DLSA కార్యదర్శి శ్రీదేవి, జడ్జిలు పట్టాభిరామారావు, ADJలు పద్మావతి, ఆంజనేయులు, BAR కౌన్సిల్ PRSDT కొండల్ రెడ్డి, గోపీశంకర్ యాదవ్ ఉన్నారు.
News September 23, 2024
గచ్చిబౌలి: సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే
గచ్చిబౌలి పరిధిలోని T-HUBలో సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే వేడుకలు నిర్వహిస్తామని కార్య నిర్వాహకులు తెలిపారు. AI, డిజిటల్ విధానం, ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.