News February 22, 2025
HYD: చందానగర్లో దారుణ హత్య

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్కు చెందిన ఫక్రుద్దీన్, నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 23, 2025
బంజారాహిల్స్: కాంగ్రెస్ సర్కార్పై హరీశ్ రావు ఎద్దేవా

కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్ధతకు, చేతగాని తనానికి నిదర్శనం అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదే అని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమిషన్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
News February 23, 2025
HYD: కొడుకు చేతిలో తండ్రి హత్య.. (వివరాలు)

కుషాయిగూడ PS పరిధిలో శనివారం కన్న తండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లి గ్రామానికి చెందిన అరెల్లి మెగిలి(45) జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చి లాలాపేటలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి నిత్యం తాగొచ్చి కుటుంబసభ్యులను డబ్బుల కోసం వేధించసాగాడు. విసిగిపోయిన కొడుకు సాయికుమార్ తండ్రిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ECIL బస్టాండ్ వద్ద అందరు చూస్తుండగానే నిన్న హత్య చేశాడు.
News February 23, 2025
BREAKING: మైనర్లపై పెట్రో దాడి.. గాయాలు

పేట్ బషీరాబాద్ PS పరిధిలో దారుణం జరిగింది. జై రామ్ నగర్లోని నిర్మాణుష్య ప్రాంతంలో ఆడుకునేందుకు ఐదుగురు మైనర్లు (ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు బాలికలు) వెళ్లారు. ఇద్దరు అమ్మాయిలపై జరిగిన పెట్రోల్ దాడిలో ఒక బాలిక(10)కు తీవ్ర గాయలు, మరో బాలిక(9)కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైనర్లకు పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టే ఎక్కడి నుంచి వచ్చాయన్నది మిస్టరీగా మిగిలింది.