News February 25, 2025
HYD: జేసీపీగా బాధ్యతలు స్వీకరించిన జోయల్

HYD నగర ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీస్ కమిషనర్గా జోయల్ డేవిస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సైబరాబాద్ ట్రాఫిక్ చీఫ్గా పనిచేశారు. ఆయన కొన్నేళ్లుగా నగర ట్రాఫిక్కు ఐజీ ర్యాంకులో ఉండే అధికారిగా అదనపు సీపీ హోదాలో బాధ్యతలు వహిస్తుండగా.. ప్రస్తుతం డీఐజీ ర్యాంకులో ఉండటంతో ఆయనను సంయుక్త పోలీస్ కమిషనర్గా నియమించారు.
Similar News
News December 14, 2025
మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన ఎన్నికలు: కలెక్టర్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 2వ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామన్నారు.
News December 14, 2025
నర్సాపూర్కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

చెన్నై–విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉ. 5.30కి బయలుదేరి ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.
News December 14, 2025
సంగారెడ్డి: మధ్యాహ్నం 1 వరకు 82.75 పోలింగ్

సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం ఒకటి వరకు 82.75% పోలింగ్ నమోదయింది. మొత్తం 2,99,578 మంది ఓటర్లకు గాను 2,47,911 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


