News February 11, 2025
HYD: డ్రగ్స్ పట్టేందుకు 120 జాగిలాలకు శిక్షణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739201987679_15795120-normal-WIFI.webp)
నగరంలో డ్రగ్స్ మూలాలపై ANB యాంటీ నార్కోటిక్ బ్యూరో ఫోకస్ పెట్టింది. బాంబు తరహాలో నార్కిటిక్స్ డాగ్ స్క్వార్డును అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. సుమారు 120 జాగిలాలను అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు. ఈ జాగిలాలు డ్రగ్స్ మూలాలను సైతం పసిగట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.
Similar News
News February 11, 2025
అయిజ: గుండెపోటుతో RMP వైద్యుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739290717925_50929634-normal-WIFI.webp)
అయిజ మండలంలో గుండెపోటుతో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం స్టేజీలో కొన్నేళ్లుగా వెంకట్రాముడు అనే వ్యక్తి RMP వైద్యుడిగా పని చేస్తున్నాడు. కాగా నేడు సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. వైద్యుడి మృతితో పలు గ్రామాల ప్రజలు విచారణ వ్యక్తం చేశారు.
News February 11, 2025
శివరాత్రి సందర్భంగా అధికారులతో మంత్రి సురేఖ సమీక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739261620550_18102126-normal-WIFI.webp)
మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. గతేడాది నిర్వహణ అనుభవాల ఆధారంగా ఈసారి చర్యలు చేపట్టాలన్నారు.
News February 11, 2025
జేఈఈ మెయిన్-2025 ఆలిండియా టాపర్గా భాష్యం విద్యార్థిని
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739291316972_1286-normal-WIFI.webp)
జేఈఈ మెయిన్-2025 జనవరి ఫలితాలలో భాష్యం అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. సెషన్-1 ఫలితాలలో భాష్యం విద్యార్థి గుత్తికొండ సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించిన ఏకైక తెలుగు విద్యార్థిగా నిలిచింది. మరెంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. భాష్యం ప్రత్యేక కరికులంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలుయజేస్తూ.. విద్యార్థులను, అధ్యాపకులను సంస్థ యాజమాన్యం అభినందించింది.