News April 3, 2024
HYD: తెలంగాణ భవన్లో ఇఫ్తార్ విందు
తెలంగాణ భవన్లో ఇవాళ జరిగిన ఇఫ్తార్ విందు వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్తో కలిసి ఇఫ్తార్ను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 7, 2024
HYDలో నమోదైన వర్షపాతం వివరాలు
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. మల్కాజిగిరిలో అత్యధికంగా 4.45 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మారేడ్పల్లిలో 2.85, సీతాఫల్మండిలో 2.43, కూకట్పల్లిలో 1.60, ఉప్పల్ 1.35 సెంటీమీటర్ల వర్షం పడింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
News October 7, 2024
HYD: డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి
HYD బేగంపేట్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, మల్లారెడ్డి మనుమరాలు శ్రేయారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులున్నారు.
News October 6, 2024
HYD: రూ.100 కోట్ల అండర్ ట్యాంకుల నిర్మాణం
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో 50 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల వరద నీటి నిల్వ సామర్థ్యం కలిగిన అండర్ ట్యాంక్స్ నిర్మిస్తోంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన 18 చోట్ల భూగర్భ ట్యాంకులు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నగరంలో వరద నీరు నిలిచే 141 ప్రాంతాలను 50కి తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.