News March 30, 2025

HYD: పంజాగుట్ట కేసు.. ఇన్‌స్టా రీల్స్‌లో మార్పు!

image

బెట్టింగ్ ప్రమోషన్స్ వ్యవహారంలో సజ్జనార్ ఉద్యమంతో పంజాగుట్ట PSలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో గతంలో తెలిసి తెలియక ప్రమోట్ చేసిన వారే ఇప్పుడు బెట్టింగ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేస్తున్నారు. డబ్బులు తగలబెట్టి మరీ ఈజీగా మనీ సంపాదించవచ్చు అని అమాయకులను ప్రలోభ పెట్టినవారు HYD పోలీసుల చర్యలతో పరారీ అవుతున్నారు. ఇక ఇన్‌స్టా రీల్స్‌లోనూ జనాలను మభ్య పెట్టే ప్రమోషన్స్ తగ్గడం విశేషం.

Similar News

News April 2, 2025

కరోనా బారినపడ్డ పాక్ అధ్యక్షుడు

image

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను కరాచీలోని ఓ ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉంచారు. జర్దారీ జ్వరంతో పాటు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కరోనా నిర్ధారణకు ముందు ఆయన ఈద్ ప్రార్థనల్లో పాల్గొనడంతో పాటు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.

News April 2, 2025

IPL: టాస్ గెలిచిన GT

image

RCBతో మ్యాచులో టాస్ గెలిచిన GT బౌలింగ్ ఎంచుకుంది.
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, రజత్(C), లివింగ్‌స్టోన్, జితేశ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్
GT: గిల్(C), బట్లర్, సుదర్శన్, ఇషాంత్ శర్మ, షారుఖ్ ఖాన్, తెవాటియా, సాయి కిశోర్, రషీద్ ఖాన్, అర్షద్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

News April 2, 2025

PPM: రెవెన్యూ సదస్సుల్లో 99.34 శాతం పూర్తి

image

జిల్లాలో 6,246 రెవెన్యూ సదస్సులకు గాను 6,205 సదస్సులను చేపట్టి 99.34 శాతం మేర పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అడిషనల్ సీసీఎల్ఎకు వివరించారు. రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్, రెగ్యులరైజేషన్, నీటి పన్ను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో అడిషనల్ సీసీఎల్ఎ, సెక్రటరీ డా. ఎన్.ప్రభాకరరెడ్ది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!