News July 2, 2024

HYD: పరీక్ష ల్యాబ్ లా నూతన భవనం ప్రారంభం

image

రాజేంద్రనగర్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి రూ.790 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మట్టి, విత్తనాలు ఫర్టిలైజర్ పరీక్ష ల్యాబ్ లా నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు ప్రారంభించారు. రైతులందరూ పంటలు నష్టపోకుండా అధిక దిగుబడి సాధించేందుకు, తమ భూముల సారవంతం తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు, రైతులు వాడే విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News October 11, 2024

HYD: CM రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలి: చెన్నయ్య

image

ఎస్సీలలో ఎక్కువగా లబ్ది పొందింది మాదిగ కులస్తులేనని, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ జి.చెన్నయ్య స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ సమావేశంలో పోరాట సమితి ఛైర్మన్లు వెంకటేశ్వర్లు, బేల బాలకిషన్, గోపోజు రమేశ్, బత్తుల రాంప్రసాద్‌తో కలిసి చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలని పేర్కొన్నారు.

News October 11, 2024

HYDలో రేపు డబుల్ ధమాకా

image

హైదరాబాద్‌లో ఈ దసరాకు తగ్గేదే లేదు. విందుకు వినోదం జతకానుంది. రేపు దసరాతో పాటు ఉప్పల్ వేదికగా ఇండియా VS బంగ్లాదేశ్‌ T-20 మ్యాచ్ జరగనుంది. నగరం అంతటా ఇక సందడే సందడి. ఉదయం నుంచే ఆలయాలు, అమ్మవారి మండపాలు కిక్కిరిసిపోతాయి. మధ్యాహ్నం బలగం అంతా కలిసి విందులో పాల్గొంటారు. సాయంత్రం వరకు హైదరాబాద్ అంతటా దసరా వైభోగమే. దీనికితోడు‌ రాత్రి మ్యాచ్‌ ఉండడంతో క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు.

News October 11, 2024

జీహెచ్ఎంసీ పథకాలను ప్రశంసించిన ఏపీ అధికారులు

image

ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మున్సిపల్ అధికారులు, జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న పథకాలను గురువారం సమీక్షించారు. ముఖ్యంగా ట్యాక్స్, ఫైనాన్స్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కంట్రోల్ రూమ్ వంటి విభాగాల్లో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలను ప్రదర్శించారు.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు వివిధ విభాగాలలో తమ విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.