News September 29, 2024
HYD: పింక్ పవర్ రన్.. పాల్గొన్న ఐటీ ఉద్యోగులు
HYD గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ 3కే, 5కే, 10కే పింక్ పవర్ రన్ను మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పింక్ పవర్ రన్ నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
Similar News
News September 29, 2024
HYD: రూ.650 కోట్లతో కట్టుదిట్టంగా నాలా వ్యవస్థ
సీఎం రేవంత్ HYD నగరంలోని నాలాల వ్యవస్థను తక్షణమే సంస్కరించాలని నిర్ణయించారు.మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో ప్రత్యేక ప్రణాళికతో వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. నాలా పనుల కోసం రూ. 650 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. అక్రమణల కారణంగా, నాలాల వెడల్పు 50 అడుగుల నుంచి 10 అడుగులకు చేరుకుంది. వీటిని తొలగించేందుకు హైడ్రాకు బాధ్యత అప్పగించనున్నారు.
News September 29, 2024
HYD: రాజాసింగ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తుల రెక్కీ
HYD గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. అనుమానితుల ఫోనులో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిని ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 29, 2024
HYD: దూరవిద్య కోర్సుల పరీక్ష తేదీల ఖరారు!
PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.