News May 19, 2024

HYD: పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి

image

పిడుగుపాటుకు ముగ్గురు రైతులు బలయ్యారు. ఒకే రోజు యాలాల మండలంలోని వేర్వేరు గ్రామాల్లో జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది. జుంటుపల్లిలో రైతులు శ్రీనివాస్, లక్మప్పలు తమ వరి పంట కోయిస్తున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడటంతో సమీప చెట్టు కిందకి వెళ్లారు. పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బెన్నూరులో సైతం రైతు గొల్ల వెంకన్న వర్షం పడే సమయంలో చెట్టు కింద ఉండగా పిడుగుపడి మృతి చెందాడు.

Similar News

News October 4, 2024

HYD: నేడు హైకోర్టులో వైద్య శిబిరం

image

నిర్మాణ్ సంస్థ, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ఈరోజు హైకోర్టులో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డా.రాకేశ్ సహాయ్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.

News October 4, 2024

గోవా వెళ్తున్నారా..? సికింద్రాబాద్ నుంచి 2 ట్రైన్లు

image

సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్- వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.

News October 3, 2024

HYD: పోలీసుల సూచనలు.. ఇలా చేస్తే SAFE!

image

✓క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్ లైన్ బ్యాంకింగ్, కంప్యూటర్, మొబైల్ లాంటి వాటి పాస్వర్డ్ తరచుగా మార్చుకోవాలి
✓పాస్వర్డ్ పెట్టేముందు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండేలా చూసుకోవాలి
✓పాస్వర్డ్ వివరాలను ఎంత దగ్గర వారికైనా చెప్పొద్దు
✓ఫేక్ మెసేజ్ లింకులు, మెయిల్స్, కాల్స్ పై స్పందించకండి.
✓సైబర్ నేరంగా గుర్తిస్తే 1930కు కాల్ చేయండి
•పై సూచనలు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చేశారు.