News April 14, 2025
HYD: పెళ్లి అయిన 3 రోజులకే హత్య (UPDATE)

రెయిన్బజార్ PS పరిధిలో జరిగిన రౌడీషీటర్ మసీయుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించేందుకు హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్య ఘటనతో ఫలక్నుమా ఉలిక్కిపడింది. మసీయుద్దీన్కు <<16091246>>3 రోజుల క్రితమే వివాహం<<>> జరిగినట్లు తెలుస్తోంది. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News April 18, 2025
గుణదలలో షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు ఏప్రిల్ 21న గుణదలలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి గోగులమూడి విజయ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. ఇక్కడ ఎంపికైన వారు మదనపల్లిలో ఈనెల 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.
News April 18, 2025
IPL: RCBకి బిగ్ షాక్

పంజాబ్తో మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన RCB కష్టాల్లో పడింది. 6.1 ఓవర్లలో 33 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 4, కోహ్లీ 1, లివింగ్స్టోన్ 4, జితేశ్ 2, కృణాల్ ఒక పరుగుకే పెవిలియన్ చేరారు. వర్షం కారణంగా పిచ్ బౌలింగ్కు అనుకూలిస్తోంది. మ్యాచును 14 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. PBKS బౌలర్లలో అర్ష్దీప్ 2, బార్ట్లెట్, చాహల్, జాన్సెన్ తలో వికెట్ తీశారు.
News April 18, 2025
60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న బీజేపీ నేత

బెంగాల్ BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్(60) పార్టీ కార్యకర్త రింకూ ముజుందార్(51)ను పెళ్లాడారు. ఇప్పటివరకు బ్రహ్మచారిగానే ఉన్న అతను తన తల్లి చివరి కోరిక మేరకు వివాహం చేసుకున్నట్లు తెలిపారు. రింకూకు ఇది రెండో వివాహం కాగా ఓ కుమారుడు కూడా ఉన్నారు. మార్నింగ్ వాక్ సందర్భంగా 2021లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇటీవల ఈడెన్ గార్డెన్స్లో IPL మ్యాచ్ చూడటానికి వెళ్లి పెళ్లిపై నిర్ణయం తీసుకున్నారు.