News March 25, 2024
HYD: ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: సజ్జనార్

డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ మోసగిస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు సూచిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ X వేదికగా పలు సూచనలు చేశారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని ఫోన్ కాల్స్, ఐవీఆర్ కాల్స్ వస్తే స్పందించొద్దని సజ్జనార్ సూచించారు. ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. కాగా HYDలో ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి.
Similar News
News April 20, 2025
HYD: ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా భారీ ఆదాయం

ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా తెలంగాణ రవాణాశాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. శనివారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఒక్క రోజులోనే రూ.3.71 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మొత్తం 50కు పైగా ఫ్యాన్సీ నంబర్లు వేలంలో అమ్మకమయ్యాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా 9999, 0001, 6666, 7777 వంటి నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని తెలిపారు.
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్లో చూసుకోవాలని సూచించారు.
News April 19, 2025
HYDలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

సికింద్రాబాద్ రాంగోపాల్పేట్ బాపుబాగ్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కాసమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి, ముఠాలోని అవియాజ్, హుస్సేన్లను అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం HYDకు వచ్చిన అమాయకపు యువతులను స్వప్న అనే మహిళ ఈ కూపంలోకి దించుతోందని గుర్తించారు. ఈ ముఠాలోని లడ్డు, స్వప్న పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.