News July 3, 2024
HYD: ప్రజాభవన్ వద్ద రూ.5 భోజనం ప్రారంభం
HYD బేగంపేట్లోని జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో ప్రజావాణికి ప్రతి మంగళ, శుక్ర వారాల్లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం హరేకృష్ణ మూమెంట్ సహకారంతో ప్రజాభవన్ వద్ద భోజనశాల ఏర్పాటు చేశారు. దాదాపు 400మందికి సరిపడేలా భోజనం ఏర్పాటు చేయగా, మధ్యాహ్నంలోగానే పూర్తయ్యింది.
Similar News
News October 11, 2024
ఆయుధ పూజలో చేసిన స్పీకర్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నివాసంలో ఆయుధ పూజలు నిర్వహించారు. ప్రజలకు స్పీకర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూజలో చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పామెన భీమ్ భరత్ ఓఎస్డీ వెంకటేశం, రఘుపతి రెడ్డి, నవాబ్పేట్ మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
News October 11, 2024
HYD: అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎంకు ఆహ్వానం
గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి శుక్రవారం CM రేవంత్ రెడ్డిని అలయ్ బలయ్కు ఆహ్వానం అందించారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 13న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
News October 11, 2024
HYD: CM రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలి: చెన్నయ్య
ఎస్సీలలో ఎక్కువగా లబ్ది పొందింది మాదిగ కులస్తులేనని, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ జి.చెన్నయ్య స్పష్టం చేశారు. బషీర్బాగ్ సమావేశంలో పోరాట సమితి ఛైర్మన్లు వెంకటేశ్వర్లు, బేల బాలకిషన్, గోపోజు రమేశ్, బత్తుల రాంప్రసాద్తో కలిసి చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలని పేర్కొన్నారు.