News July 27, 2024
HYD: ప్రజావాణికి 681 దరఖాస్తులు
HYD ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 681 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూకు సంబంధించినవి 69, పౌరసరఫరాల శాఖవి 132, విద్యుత్ 87, హౌసింగ్ 232, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 31, ఇతర శాఖలకు సంబంధించినవి 130 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య దరఖాస్తులు స్వీకరించారు.
Similar News
News October 2, 2024
HYD: మూసీ ప్రజలు నిశ్చింతంగా ఉండండి: మధుయాష్కి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదని దానికి నాది గ్యారెంటీ అని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇళ్లు ఇచ్చే ప్రభుత్వమని, ఎవరి ఇళ్లు కూలగొట్టదని పేర్కొన్నారు. ఇళ్ల పైకి ఒక్క గడ్డపార రాదని.. ఒక జేసీబీ కూడా రాకుండా చూసే బాధ్యత తమదని అన్నారు.
News October 2, 2024
HYD: పండగల తేదీలు ఫిక్స్ చేసిన ‘శ్వాస్’
సనాతన ధర్మ వ్యాప్తికి, సమాజ శ్రేయస్సు దృష్ట్యా పండగలు విశేష పర్వదినాల తేదీలను సిద్ధం చేశారు. ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు రాబోయే ‘విశ్వావసు నామ సంవత్సరం-2025-26’లో పండుగల తేదీలను నిర్ణయించినట్లు శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి (శ్వాస్) ప్రకటించింది. నిర్ణయించిన పండగల తేదీలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేస్తామని శ్వాస్ తెలిపింది.
News October 2, 2024
HYD: బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త!
HYDలో బైకులు ఎత్తుకుపోతున్నట్లు నిత్యం కేసులు నమోదవుతున్నాయి. కాగా ఘరానా దొంగలే కాకుండా జల్సాలకు అలవాటు పడ్డ కొందరు యువకులు ఈ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఉప్పల్, అంబర్పేట, ఆర్టీసీ క్రాస్రోడ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, అఫ్జల్గంజ్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, యాచారం, మంచాల ఇళ్ల ముందు బైకులు ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు. పండగలకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.