News May 29, 2024
HYD: ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. తీవ్ర ఉత్కంఠ
లోక్సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో HYD,రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Similar News
News September 29, 2024
HYD: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత..!
HYDలోని 691 ప్రభుత్వ పాఠశాలలో 1,12,650 మంది విద్యార్థులు ఉండగా.. వీరికి 4,265 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. RR, MDCL, VKB జిల్లాల పరిధిలో అనేక పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. 10వ తరగతి విద్యార్థులకు మరీ ఇబ్బందిగా మారింది. ఇకనైనా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.
News September 29, 2024
సికింద్రాబాద్: ప్రమాదాల నివారణకు రక్షణ కవచ్
సికింద్రాబాద్, కాచిగూడ సెక్షన్ ప్రాంతాల్లో రైల్వే ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దాదాపు 273 కిలోమీటర్ల పరిధిలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 11న కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకదానికొక రైలు ఎదురుగా ఢీకొంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ రక్షణ చేస్తున్నట్లు తెలిపారు. రక్షణ కవచ్ యంత్రాలు దాదాపు 28 స్టేషన్లో ఏర్పాటు చేశారు.
News September 29, 2024
HYD: సబ్సిడీ రాలేదా..? వెంటనే కాల్ చేయండి!
HYD, RR, MDCL, VKB మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సబ్సిడీ సంబంధించిన పత్రాలు ఇప్పటికే చాలా మందికి జారీ అవ్వగా.. సబ్సిడీ లబ్ధి కూడా పలువురికి అందుతుంది. అయితే సిలిండర్ డెలివరీ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాల్లో 4 రోజుల్లో జమకాకుంటే వెంటనే 1967, 1800-4250-0333 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.