News September 14, 2024
HYD: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య
భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. VKB జిల్లా పెద్దేముల్కు చెందిన భార్యభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది.
Similar News
News September 29, 2024
HYD: రాజాసింగ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తుల రెక్కీ
HYD గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. అనుమానితుల ఫోనులో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిని ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 29, 2024
HYD: దూరవిద్య కోర్సుల పరీక్ష తేదీల ఖరారు!
PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.
News September 29, 2024
HYD: భూముల సేకరణలో TDR జారీకి కసరత్తు..!
HYD మీరాలం చెరువుపై చింతల్ మెట్ నుంచి బెంగళూర్ వైపు వెళ్లే రోడ్డు వరకు 2.5KM వంతెన నిర్మాణంలో ప్రైవేటు స్థలాలను సేకరించాల్సి ఉంది. ప్రైవేటు భూములకు పూర్తిగా TDR జారీ చేసేందుకు HMDA అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మియాపూర్ నుంచి గండిమైసమ్మ మార్గంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ, శివారు మున్సిపాలిటీల్లోని పనులకు TDR జారీ చేయనున్నారు.