News February 8, 2025
HYD: మంత్రికి TWJF ప్రతినిధుల వినతిపత్రం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738983072471_51765059-normal-WIFI.webp)
HYDలోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి దామోదరరాజనర్సింహను TWJF ప్రతినిధుల బృందం కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. హెల్త్ కార్డులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నా.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Similar News
News February 8, 2025
వికారాబాద్: మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739000267386_51639231-normal-WIFI.webp)
గ్రామాల్లో మహిళలకు అవగాహన కలిగించి మహిళా స్వయం సహాయక సంఘాలకు బలోపేతం చేసేందుకు సీఅర్పీ వ్యూహం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సీఅర్పీ మహిళలతో మాట్లాడారు. మహిళా సంఘాల బలోపేతం లక్ష్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో లింగయ్యనాయక్ ఉన్నారు.
News February 8, 2025
రెపోరేటు తగ్గింపు.. EMI ఎంత తగ్గుతుందంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738998543738_81-normal-WIFI.webp)
RBI రెపోరేటును 6.25శాతానికి తగ్గించింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై EMI కూడా తగ్గనుంది. 20 ఏళ్ల కాలపరిమితికి రూ.20 లక్షల ఇంటి రుణం తీసుకున్న వారికి ఏడాదికి రూ.3,816, రూ.30 లక్షలైతే రూ.5,712, రూ.50 లక్షలు తీసుకుంటే రూ.9,540 తగ్గుతుంది. అలాగే ఐదేళ్ల కాలపరిమితికి కారు లోన్లు తీసుకుంటే రూ.5 లక్షలకు ఏడాదికి రూ.732, రూ.7 లక్షలకు రూ.1020, రూ.10 లక్షలకు రూ.1464 వరకు EMI తగ్గుతుంది.
News February 8, 2025
ఆహార శుద్ధి పరిశ్రమకు అగ్రిమెంట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739003863948_14560643-normal-WIFI.webp)
భూపాలపల్లి, ములుగు జిల్లాలోని రైతు సోదరులతో అగ్రిమెంట్ చేయించుకుని ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం తరఫున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు తెలిపారు. ఈ జిల్లాలో పండుతున్న పంటలు, రైతుల అభిప్రాయాలను తెలుసుకునే విధంగా శనివారం నాబార్డ్ జీఎం తో సమావేశమయ్యారు. నాబార్డ్ అధికారులు సొసైటీ డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, కిరణ్ ఉన్నారు.