News February 3, 2025

HYD: మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే జాగ్రత్త..!

image

మత్తుపదార్థాల వినియోగం యువతలో వేగంగా పెరుగుతుండటంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు తల్లిదండ్రులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. రేవ్‌పార్టీలు, అనుమానాస్పద మాత్రలు, రహస్య ప్రవర్తన వంటి ప్రారంభ లక్షణాలను గమనించడం వల్ల యువతను మత్తుపదార్థాల మాయాజాలం నుంచి కాపాడవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడంతో సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News February 3, 2025

నులిపురుగుల మాత్రలు పక్కగా పంపిణీ చేయాలి: కలెక్టర్

image

నులిపురుగుల నివారణ మాత్రలు పక్కాగా పంపిణీ చేయాలనీ కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి ఆదేశించారు. 1-19 ఏళ్ల వారందరికీ ఈ నెల 10న తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్బెన్డజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు.

News February 3, 2025

హైదరాబాద్‌: నుమాయిష్‌కు పోటెత్తారు!

image

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో  జరుగుతున్న నుమాయిష్‌కు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సందర్శకులు పోటెత్తారు. దీంతో స్టాళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఇప్పటివరకు నుమాయిష్‌ను దాదాపు 12 లక్షల మంది సందర్శించారు. ఆదివారం మాత్రం 70 వేల మంది విజిట్ చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

News February 3, 2025

HYD: అబద్ధాలు చెప్పిన KCR: కోదండరాం రెడ్డి

image

కాళేశ్వరం కట్టతో పాటు అది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అంటూ KCR అవాస్తవాలు కూడా నిర్మించారని MLC కోదండరాం రెడ్డి ఆరోపించారు. HYD సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ జర్నలిస్ట్ రేమిల్ల అవధాని రచించిన ‘కాళేశ్వరం ఫియాస్కో: ఎ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్’ పుస్తకాన్ని TG మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. KCR అబద్ధాలు చెప్పారని, కాళేశ్వరంతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు.