News April 8, 2024

HYD: రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం: రోనాల్డ్ రాస్

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఇప్పటి వరకు రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.1,73,60,502 విలువ జేసే ఇతర వస్తువులు, 19,380 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News December 16, 2025

IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

image

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

News December 16, 2025

HYD: ‘చే’ చివరిపోరుకు ‘బొలీవియా డైరీ’ రూపం

image

‘బొలీవియా డైరీ’లో చేగువేరా చివరి రోజులు, గెరిల్లా పోరాటం, <<18569067>>విప్లవంపై<<>> ఆయన అచంచల నిబద్ధత.. హృదయాన్ని ఇందులోని అక్షరాలు కదిలిస్తాయి. ఆకలి, వ్యాధులు, ద్రోహం, అపజయాల మధ్య వెనకడుగు వేయని విప్లవ ఆత్మ ప్రతి పుటలో ఉప్పొంగుతుంది. విజయానికి మించిన సిద్ధాంత విశ్వాసమే చేగువేరా జీవన తత్వంగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం పర్సనల్ డైరీ కాదు.. ప్రపంచ విప్లవ చరిత్రలో ఒక అమర పుట. ఇది యువతను ఆలోచింపజేసే రచన.

News December 16, 2025

డేంజర్‌లో హైదరాబాద్‌

image

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్‌, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.