News May 8, 2024

HYD: రూ.91.64 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

image

వయోధికుడి నుంచి రూ.91.64 లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. నగరానికి చెందిన 74 ఏళ్ల వయోధికుడికి ఫెడెక్స్ కొరియర్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీకు వచ్చిన పార్సెల్‌లో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే తమకు డబ్బు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భయపడ్డ వయోధికుడు రూ.91.64లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు.

Similar News

News October 3, 2024

HYD: యూనివర్సిటీ ర్యాంకుల FULL REPORT

image

✓HYDలోని ఆర్మీ డెంటల్ కాలేజ్ ఇండియాలో 40వ ర్యాంకు సాధించింది✓ఉస్మానియా మెడికల్ కాలేజ్ 48వ ర్యాంకు సాధించింది✓న్యాయవిద్యలో నల్సార్ యూనివర్సిటీకి 3వ ర్యాంకు✓ఇన్నోవేషన్ విభాగంలో IITH మూడో ర్యాంకు✓పరిశోధనల్లో IITH 15, HCU 18 ర్యాంకు ✓వ్యవసాయ కళాశాలల్లో జయశంకర్ యూనివర్సిటీ 37వ ర్యాంకు ✓IIIT HYD టాప్ 100 యూనివర్సిటీలో 74వ ర్యాంక్

News October 3, 2024

రాచకొండ కమిషనరేట్ పరిధిలో డీజే వినియోగంపై నిషేధం: సీపీ

image

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ 223, 280, 292, 293, 324, బీఎన్ఎస్ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

News October 2, 2024

BREAKING: HYD: KTRపై PSలో ఫిర్యాదు

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే KTRపై HYD వనస్థలిపురం PSలో కాంగ్రెస్ నేత, TPCC మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాలనకు రూ.1.50 లక్షల కోట్లు కేటాయించారని అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ఈ ప్రణాళిక చేశారని ఇటీవల KTR ఆరోపించారు. సీఎంపై, కాంగ్రెస్ అధిష్ఠానంపై తప్పుడు ఆరోపణలు చేసిన KTRపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.